ఏపీ ఓటర్ జాబితాలో వైసీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో ఓటర్ లిస్టుల అవకతవకలను ఈసీ దృష్టికి తీసుకెళ్లేందుకు వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. సర్వేల పేరుతో వైసీపీ సానుభూతి పరుల పేర్లను ఓటర్ జాబితా నుంచి తొలగించే ప్రయత్నం టీడీపీ కార్యకర్తలు చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది.
విజయనగరం జిల్లాతోపాటు కడప, అనంతపురంతోపాటు పలు జిల్లాలలో సర్వేల పేరుతో పేర్లు తొలగించే కుట్ర చేస్తున్నారంటూ వైసీపీ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఢిల్లీలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆదివారం సాయంత్రి జగన్ ఢిల్లీ బయలుదేరనున్నారు. ఢిల్లీ నుంచి మంగళవారం మళ్లీ హైదరాబాద్ చేరుకోనున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా చిత్తూరు జిల్లాలో జరిగే పార్టీ కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం.
చంద్రబాబుకు ఓటు ద్వారా రాజకీయ శిక్ష: మందకృష్ణ