చంద్రబాబునాయుడు సెక్రటేరియేట్ కు వెళ్తే ఆధారాలు మాయంచేస్తారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. అంతేకాకుండా తనకు సంబంధించిన బినామీలకు, కాంట్రాక్టర్లకు విచ్చలవిడిగా చెక్కులు అందజేస్తారని దుయ్యబట్టారు. ఇది ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ కాబట్టి, కొత్త ప్రభుత్వం వచ్చేదాకా చంద్రబాబు సెక్రటేరియేట్ ను దుర్వినియోగం చేయడం ధర్మం కాదున్నారు. అక్కడ కూడా గట్టిగా యాక్షన్ తీసుకోవాలని గవర్నర్ గారికి వివరించాని అని జగన్ అన్నారు.
ఈవీఎంలపై ఫిర్యాదులు చేస్తున్నది కేవలం చంద్రబాబు మాత్రమే త అని జగన్ వ్యాఖ్యానించారు. 80 శాతం మంది ఓటు వేసి, తాము ఎవరికి ఓటు వేశామో వీవీ ప్యాట్ లో చూసుకుని సంతృప్తి చెందారన్నారు. వాళ్లెవ్వరు ఫిర్యాదు చేయలేదని కేవలం చంద్రబాబు మాత్రం తాను ఎవరికి ఓటు వేసిందీ తనకు తెలియడం లేదని సినిమా డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ఓ విలన్ మాదిరి ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. పోలింగ్ ఏజంట్లతో మాక్ పోలింగ్ నిర్వహించినప్పుడు కూడా ఏ విధమైన ఫిర్యాదులూ లేవని అన్నారు. ఈవీఎంలలో లోపాలుంటే పోలింగ్ బూత్ లలో ఉన్న టీడీపీ ఏజంట్లు ఎందుకు ప్రశ్నించలేదని జగన్ మండిపడ్డారు.
తెలంగాణ ప్రభుత్వానికి బుద్ధి, జ్ఞానం లేదు: సీపీఐ నేత చాడ