ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా బుధవారం వైఎస్ జగన్తో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటి అయ్యారు. గంటన్నర సేపు సుదీర్ఘంగా చర్చించిన అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ఎంపీల సంఖ్య పెరిగితేనే కేంద్రంపై మరింత ఒత్తిడి తీసుకొచ్చేందుకు వీలయ్యే అవకాశం ఉందని జగన్ అభిప్రాయపడ్డారు. ఏపీకి చెందిన 25 ఎంపీలకు తోడుగా తెలంగాణకు చెందిన 17 మంది ఎంపీలు కలిస్తే కేంద్రంపై మరింత ఒత్తిడి పెరుగుతుందన్నారు.
పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలు అమలు చేయలేని దుస్థితి నెలకొందని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ ఎంపీలకు తెలంగాణ ఎంపీలు తోడైతే కేంద్రాన్ని నిలదీసేందుకు అవకాశం ఏర్పడుతోందన్నారు. జాతీయస్థాయిలో రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాలను అడ్డుకొనేందుకు కేసీఆర్ చేస్తున్న కృషిని జగన్ అభినందించారు.
పార్టీలో చేరిన తనకు పవన్ ఓ నాయకుడు: నాగబాబు