telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

400 కోట్ల క్లబ్ లో “సాహో”

Saaho

ప్రభాస్ ప్రధాన పాత్రలో సుజీత్‌ దర్శకత్వం వహించగా, యూవీ క్రియేషన్స్‌ సంస్థ దాదాపు 300 కొట్లతో నిర్మించిన చిత్రం “సాహో”. ఈ చిత్రం భారీ అంచనాలతో ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. యూవీ క్రియేషన్స్‌ నిర్మించిన ఈ చిత్రంలో నీల్‌ నితిన్‌ ముఖేష్‌, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, వెన్నెల కిశోర్‌, మందిరా బేడీ కీలక పాత్రల్లో నటించారు. శ్ర‌ద్ధా క‌పూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. డివైడ్ టాక్ తెచ్చుకున్న‌ప్ప‌టికి భారీ వ‌సూళ్ళు సాధించ‌డం చిత్ర బృందానికి సంతోషాన్నిచ్చింది. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద జెట్ స్పీడ్‌లో పరుగులు తీస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ‘సాహో’ రూ.400 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ప్రకటించింది. ఈ మేరకు ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. ‘ఇంతకంటే ఎక్కువ మీరు ఊహించగలరా..’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అయితే అభిమానులు మాత్రం ఇది సరిపోదని అంటున్నారు. రూ.350 కోట్లు పెట్టి తీసిన సినిమా కనీసం రూ.500 కోట్ల గ్రాస్ అయినా రాబట్టాలని అంటున్నారు. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంత వసూలు చేస్తుందో చూడాలి. ఇది ఇలా ఉండగా.. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎంత వసూలు చేసిందో అంతే మొత్తాన్ని బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కూడా రాబట్టడం విశేషం. మొదటి వారం రోజుల్లో ఈ సినిమా రూ.370 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే ఇందులో బాలీవుడ్ నుంచే రూ.116 కోట్లు వచ్చాయి. 10 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేస్తే దానిలో రూ.130 కోట్లు బాలీవుడ్ నుండి రావడం విశేషం.

Related posts