telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్

చిన్న చికెన్ ముక్క కోసం .. స్నేహితురాలిని హత్య చేసిన యువకుడు.. !!

Parents Murdered Daughter at Mancherial

చిన్న చికెన్ ముక్క కోసం ఓ యువతిని యువకుడు హత్య చేశాడు. ఇది నిజంగా జరిగింది. వినటానికి చాలా విచిత్రంగా ఉన్నా కూడా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఒక్క సందర్భం చాలు, యువత ఎంత సున్నిత మనసులతో ఉన్నది తెలుస్తుంది. అందుకే ప్రతి చిన్న విషయానికి ఆత్మాహుతికి పాల్పడుతున్నారు. బహుశా ఇదే బలహీనత కారణంగా తీవ్రవాదులు కూడా భారత యువతను సులభంగా బ్రెయిన్ వాష్ చేస్తున్నారేమో.. అందుకే మనవళ్లను మనకే శత్రువులుగా వాడేస్తున్నారు. ఇటీవల జరిగిన పుల్వామా లో వాడిన ఆత్మాహుతి దాడికి పాల్పడిన వాడు కూడా భారతీయుడే కావడం, ఈ సందర్భానికి దగ్గరగా ఉంది.

ఇక ఈ ఘటన గురించి వివరాల్లోకి వెళితే.. చెన్నైలోని కోయంబేడు‌లో ఓ పెద్ద పూల మార్కెట్ ఉంది. అనేక ప్రాంతాల నుంచి ఇక్కడకు భారీ ఎత్తున పూలు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు వస్తుంటారు. దీనితో తెల్లవారుజాము నుంచి అర్థరాత్రి వరకు ఈ మార్కెట్ రద్దీగా ఉంటుంది. ఈ క్రమంలో యువతి, యువకుడు పూలు కొనడానికి వచ్చారు. ఆకలిగా ఉండటంతో అక్కడికి దగ్గరలోని ఓ హోటల్ నుంచి బిర్యానీ కొనుక్కుని తింటున్నారు. అయితే తాను తింటున్న బిర్యానీలో ఒక్క చికెన్ ముక్క కూడా రాలేదని అమ్మాయి, అబ్బాయిని అడిగింది. ఈ విషయంలో మాటామాటా పెరిగి వారిద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కోపంతో ఊగిపోతున్న అబ్బాయి తన దగ్గర ఉన్న కత్తి తీసి గొంతు కోశాడు. దీనితో ఆ యువతి గట్టిగా అరుస్తూ అక్కడికక్కడే మరణించింది. ఆమె అరుపులు విన్న వ్యాపారులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అయితే వారిని గమనించిన యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts