telugu navyamedia
క్రైమ్ వార్తలు

‘అగ్నిపథ్’ ఆందోళన.. పోలీసుల కాల్పుల్లో ఒక‌రి మృతి.. ప‌లువురు పరిస్థితి విషమం పరిస్థితి విషమం

*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో పరిస్థితి తీవ్ర ఉద్రిక్త‌త‌
*ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు 
*ఒక‌రి మృతి..ప‌లువురు పరిస్థితి విషమం..ప‌లువురుకు గాయాలు

అగ్నిపథ్ ఆందోళనలతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అగ్నిగుండంగా మారింది. అగ్నిపథ్ ఆర్మీ నియామకాలను వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు సికింద్రాబాద్‌లో స్టేష‌న్‌లో విధ్వంసం సృష్టించారు. 

స్టేషన్‌లోని ఫర్నిచర్, షాపులను ధ్వంసం చేశారు. పట్టాలపై ఆగి ఉన్న మూడు రైళ్లకు నిప్పుపెట్టారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా.. కర్రలు, రాళ్లతో పోలీసులపై దాడికి దిగారు.

ప‌రిస్థితి చేయి దాటిపోవ‌డంతో ఆందోళనకారులను కట్టడి చేయడానికి పోలీసులు గాల్లోకి  15రౌండ్ల కాల్పులు జరపడంతో కొన్ని బుల్లెట్స్ ఆందోళనకారులను తగిలినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించగా.. మార్గ‌మ‌ద్య‌లో మృతి చెందాడు. ఆందోళనలో మృతిచెందిన వ్యక్తి నిర్మల్‌ వాసి వినయ్‌గా గుర్తించారు. పలువురుకు తీవ్ర‌గాయాలు కావ‌డంతో గాంధీ ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

మ‌రోవైపు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అల్లర్లపై అధికారులు అత్యవసరంగా భేటీ అయ్యారు. ఆస్తి నష్టం, ప్రయాణికుల ప్రత్యామ్నాయంపై చర్చిస్తున్నారు.

Related posts