యంగ్ హీరో శర్వానంద్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం శర్వానంద్ ‘శ్రీకారం’ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. కరోనా ప్రభావం ముగిసిన ఈ సినిమా షూటింగ్ పునఃప్రారంభం కానుంది. ‘శ్రీకారం’ ముగిసిన తర్వాత చందు మొండేటి దర్శకత్వంలో శర్వానంద్ మూవీ చేయనున్నాడు. 1990-2021 బ్యాక్డ్రాప్లో పీరియాడికల్ డ్రామాగా ఈ చిత్రం ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని డైరెక్టర్ చందు మొండేటి ఇటీవలి ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అంతేకాదు.. ఈ మూవీలో శర్వానంద్ కొత్త తరహాలో కనిపిస్తాడని, అతడికి సరికొత్త ఇమేజ్ను తీసుకొచ్చే చిత్రమిదని చందు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ‘కార్తికేయ 2’ సినిమాను పూర్తి చేస్తున్న చందు మొండేటి అది కంప్లీట్ అయిన అనంతరం శర్వానంద్ సినిమాపై ఫోకస్ పెడతాడు.
previous post