telugu navyamedia
రాజకీయ వార్తలు

ఉత్తరప్రదేశ్ : .. సైన్యాన్ని పెంచుకున్న .. యోగి ప్రభుత్వం..

yogi cabinet expansion 23 new ministers

లఖ్‌నవూలోని రాజ్‌భవన్‌లో యోగి ఆదిత్యనాథ్‌ మంత్రివర్గాన్ని విస్తరించారు. 23మందికి మంత్రివర్గంలో చోటు కల్పించడంతో మంత్రివర్గంలోని మొత్తం సభ్యుల సంఖ్య 56కు చేరింది. గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌ సమక్షంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆరుగురు కేబినెట్ మంత్రులు, మరో ఆరుగురు సహాయమంత్రులు(స్వతంత్ర హోదా), 11మంది సహాయమంత్రులుగా ప్రమాణం చేశారు. కొత్తగా 18 మందికి యోగి తన మంత్రివర్గంలో చోటు కల్పించారు.

ఆర్థికమంత్రి రాజేశ్‌ అగర్వాల్‌ సహా ఐదుగురు సీనియర్‌ మంత్రుల రాజీనామాలను గవర్నర్‌ ఆమోదించడంతో మంత్రివర్గంలో భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి. నీటిపారుదలశాఖ మంత్రి ధరమ్‌పాల్‌ సింగ్‌, ప్రాథమిక విద్యాశాఖ మంత్రి అనుపమ జైస్వాల్‌, మైనింగ్‌ శాఖ మంత్రి అర్చన పాండే, తదితరులు రాజీనామాలు చేసిన వారిలో ఉన్నారు. 75ఏళ్లు నిండిన వారు పదవుల్లో ఉండకూడదనే భాజపా నిబంధన ప్రకారం మంగళవారం పలువురు సీనియర్‌ మంత్రులు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే.

Related posts