ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో పాటు, బీఎస్పీ చీఫ్ మాయావతికి ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించారు. ఎన్నికల కమిషన్ పనితీరుపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని రాజకీయ పార్టీలు, నేతలు పాటిస్తున్నారా అని సుప్రీంకోర్టు ఈసీని ప్రశ్నించింది.
ఎన్నికల ప్రచారంలో సీఎం యోగి , బీఎస్పీ చీఫ్ మాయావతి చేసిన వ్యాఖ్యలను కూడ కోర్టు ప్రస్తావించింది. ఈ పరిణామాల నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించింది. అధెవిధంగా బీఎస్పీ చీఫ్ మాయావతిపై రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.