రవళి(20) పై ప్రేమోన్మాది పెట్రో దాడి చేయడంతో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. మంగళవారం ఆస్పత్రి మార్చురీలో రవళి శవపరీక్షలు పూర్తి చేశారు. గాంధీ ఆస్పత్రిలో రవళి మృతదేహానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళులర్పించారు. బాధితురాలి కుటుంబసభ్యులను మంత్రి పరామర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పెట్రోలు దాడి నిందితుడిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రవళి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం. రవళి చికిత్స నిమిత్తం ఆస్పత్రి ఖర్చంతా ప్రభుత్వమే భరించిందని పేర్కొన్నారు. కేసు దర్యాప్తు కోసం వరంగల్ పోలీసులు గాంధీ హాస్పిటల్కు వచ్చారు.