telugu navyamedia
రాజకీయ వార్తలు

హామీ ఇచ్చినట్టుగానే అందరికీ టికెట్లు ఇప్పించా: యడియూరప్ప

Yadyurappa

హామీ ఇచ్చినట్టుగానే రాజీనామా చేసిన ఎమ్మెల్యేలకు బీజేపీ టికెట్ ఇప్పించానని కర్ణాటక సీఎం యడియూరప్ప తెలిపారు. 17 మంది జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం వల్లే తాను ముఖ్యమంత్రిని అయ్యానని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వారికి అన్యాయం చేయనని అన్నారు. వారు ఉపఎన్నికల్లో గెలవగానే మంత్రులను చేస్తానని ప్రకటించారు.

కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలపై ప్రజలకు నమ్మకం పోయిందని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తిరోగమనంలో వెళ్తున్నారని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న సిద్ధరామయ్య ఇప్పటికీ అనవసరపు విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఉపఎన్నికల్లో ప్రజలు వారికి గుణపాఠం నేర్పుతారని అన్నారు.

Related posts