telugu navyamedia
రాజకీయ వార్తలు

అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేల గురించి చర్చిస్తా: యడియూరప్ప

Yadyurappa

కర్ణాటకలో 17 మంది అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేల పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అధికారం స్పీకర్ కు ఉంటుందని, రానున్న ఉపఎన్నికల్లో వారు పోటీ చేయవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప మీడియాతో మాట్లాడుతూ అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలు ఉపఎన్నికల్లో పోటీ చేయవచ్చంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు.

ఉపఎన్నికలు జరగనున్న అన్ని నియోజకవర్గాల్లో రేపటి నుంచి తాము పర్యటిస్తామని తెలిపారు. ఈ 17 స్థానాలను బీజేపీ నూటికి నూటొక్క శాతం గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. తమ హైకమాండ్ తో పాటు, అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేల గురించి చర్చిస్తానని తెలిపారు.

Related posts