telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

ఏపీలో ఖాతా తెరచిన వైసీపీ.. తొలి విజయం నమోదు

ycp party

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ దూసుకుపోతుంది. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాల ప్రకారమే ఫ్యాన్‌ గాలి జోరుగా వీస్తూంది. ఈ ఎన్నికల్లో వైసీపీ తొలి విజయం నమోదు చేసింది. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి వైసీపీ అభ్యర్థి ఎలిజా 31,800 ఓట్లతో విజయం సాధించారు. 

ఈ విజయంతో వైసీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. తాజా సమాచారం  ప్రకారం అసెంబ్లీ ఎన్నికల్లో 152, లోక్ సభలో 25 స్థానాల్లో వైసీపీ ఆధిక్యం దిశగా సాగుతోంది. 145 స్థానాల్లో లీడింగ్ లో ఉండగా, 29 స్థానాల్లో టీడీపీ అధిక్యంలో కొనసాగుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ప్రభావం కనిపించలేదు.

Related posts