ఇసుక కొరతను నిరసిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిన్న విశాఖలో నిర్వహించిన లాంగ్మార్చ్పై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ నిర్వహించిన లాంగ్మార్చ్ అట్టర్ఫ్లాఫ్ అయిందని ఎద్దేవా చేశారు. లాంగ్ మార్చ్ కాస్త తుస్సుమందని వ్యాఖ్యానించారు. ప్రజలను తప్పుదోవపట్టించే యాత్రలు చేస్తే మరోసారి బుద్ధిచెబుతారని అన్నారు.
అధెవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు పై గూడ విమర్శలు గుప్పించారు. ప్రజలకు చంద్రబాబు, పవన్రి అనుబంధం తెలిసిన తర్వాత కూడా ఏదో ఒక హడావుడి చేయాలి కాబట్టి దత్తపుత్రుడిని ముందుకు నెట్టాడు. ప్రజలకు దత్త పుత్రులు, చుట్టపు చూపుగా వచ్చే పుత్రులు అవసరం లేదు. కన్న కొడుకులా అందరినీ కంటికి రెప్పలా చూసుకునే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలు అని అన్నారు.
కోర్టులతో ఆటలాడితే మొట్టికాయలు తప్పవు: రేవంత్ రెడ్డి