వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిని దెబ్బతీసేందుకే వివేకానందరెడ్డిని నరికి చంపారని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. శనివారం రోజున ట్విట్టర్ వేదికగా ఈ ఘటనపై విజయసాయిరెడ్డి స్పందించారు. కడప జిల్లాలో అధికార పార్టీకి ఆయన హిమాలయ శిఖరంలా అడ్డునిల్చారన్నారు. భౌతికంగా అంతం చేస్తే తప్ప పట్టు దొరకదని.. ఇలా అమానవీయంగా హతమార్చారని పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేష్లే కుట్రకు బాధ్యులు అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
‘రాజారెడ్డి గారి హంతకులు తెలుగుదేశంలో ఉన్నత హోదాల్లో ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి గారి హెలికాప్టర్ ప్రమాదంపై అనుమానాలు అలాగే ఉన్నాయి.హత్యాయత్నంలో జగన్ గారు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. సాఫ్ట్ టార్గెట్ వివేకానంద గారిని బలితీసుకున్నారు. రక్త దాహం తీరదా చంద్రబాబూ?’ అని తన ట్విట్టర్లో ఆరోపించారు.
ఇళ్ల స్థలాల పేరుతో ఇన్సైడర్ ట్రేడింగ్: కళా వెంకట్రావు