టీడీపీ నేతలు రౌడీ చేష్టలు చేస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మీసాలు మెలేస్తూ వీధి రౌడీ పనులు చేసేముందు ప్రజలు ఏమనుకుంటారో అని అలోచించాలని హితవు పలికారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో జరిగిన తప్పులు, అవినీతిపై ఎవరూ మాట్లాడకూదని ఆ పార్టీ నేతలు అనడం సిగ్గుచేటని దుయ్యబట్టారు.
చంద్రబాబు, లోకేశ్ తో పాటు టీడీపీకి చెందిన మాజీ మంత్రులంతా ఈరోజున విచారణ అంటే భయపడి చస్తున్నారని ఆమె అన్నారు. సీఎం జగన్ కేబినెట్ కమిటీ వేయగానే జైలుకు వెళతామన్న భయంతోనే టీడీపీ నేతలు జంకుతున్నారని విమర్శించారు. చంద్రబాబు ఆయన కుమారుడు లోకేశ్ అన్నింటికి సిద్ధంగా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
అందుకే ఏపీలో టీడీపీ ఓడిపోయింది: జయప్రకాశ్ నారాయణ