ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలో ఓటమిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకోవాలని వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఎన్నికల్లో ఘోర పరాభవం నుంచి చంద్రబాబు ఇంకా కోలుకోలేకపోతున్నారని చెప్పారు. అధికారపక్షంపై ఆరోపణలు చేయడం మానుకోవాలని ఉమ్మారెడ్డి హితవు పలికారు.
గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ప్రారంభించిన ప్రాజెక్టులు ఏమీ లేవని అన్నారు. ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై సమీక్షిస్తామని ఎన్నికల సమయంలోనే జగన్ చెప్పారని గుర్తు చేశారు. తొలి కేబినెట్ సమావేశం గొప్పగా జరిగిందని ఆయన అన్నారు. మంత్రులు, అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారని తెలిపారు. తప్పులు జరగనప్పుడు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.
అలీ తాజా వ్యాఖ్యలతో వైసీపీలో అసంతృప్తి!