దేశంలోని ముస్లింలపై వివక్ష చూపేలా కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టిన సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలకు తమ పార్టీ మద్దతివ్వడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు వైసీపీ శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ప్రకటించారు. బుధవారం కర్నూలు జిల్లా ఆత్మకూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలకు వైసీపీ ఎంపీలు మద్దతివ్వడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. చట్టం అమల్లో భాగంగా ముస్లింలకు ఇబ్బందులు తలపెడితే సహించేది లేదన్నారు. అవసరమైతే రాజీనామా చేసేందుకూ వెనుకాడనని స్పష్టం చేశారు. ఈ అంశాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లామని, ఆ చట్టాలతో ఎవరికీ ఎలాంటి నష్టం వాటిల్లదని ఆయన స్పష్టం చేశారన్నారు.
previous post