telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రతిపక్షమే మీడియాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది: సజ్జల

Sajjala ycp

ప్రతిపక్షమే మీడియాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మీడియాలో కథనాలు ప్రసారం చేయకుండా కోర్టుకు వెళుతున్నారని దుయ్యబట్టారు.

అమరావతి భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణలో తొందరపాటు ఏమీ లేదని, తప్పులపై విచారణ జరగకుండా అడ్డుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. చర్యలు తీసుకుంటే కక్ష సాధింపు అంటున్నారని అసహనం వ్యక్తం చేశారు.

అమరావతి భూములపై విచారణకు నియమించిన సిట్ స్వతంత్ర విచారణ సంస్థ అని సజ్జల స్పష్టం చేశారు.టీడీపీ కార్యకర్తగా పనిచేసిన వ్యక్తికి అడ్వొకేట్ జనరల్ గా పదవి ఇచ్చారని, అతనిపై ఇన్ సైడర్ ట్రేడింగ్ కు సంబంధించి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయన్నారు. వాటి ఆధారంగానే కేసు నమోదు చేశారని సజ్జల స్పష్టం చేశారు.

Related posts