దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘యాత్ర’ రెండు రోజుల క్రితం విడుదలై, సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకున్న విషయం తెలిసిందే. దీనితో ఆ చిత్రం టీమ్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. “మహానేత రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వాన్ని సినిమాగా తెరకెక్కించటంలో మీరు చూపించిన అభిరుచి, అకింతభావానికి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు” అంటూ, దర్శకుడు మహి వీ రాఘవతో పాటు నిర్మాతలు, 70 ఎమ్ఎమ్ ఎంటర్ టెయిన్ మెంట్స్ బ్యానర్ పై సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించిన విజయ్ చిల్లా, దేవిరెడ్డి శశి, శివలను ట్వీట్ ద్వారా అభినందించారు.
ఈ చిత్రం విడుదలైన తొలి రోజు నుంచి మంచి టాక్ ను తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వైఎస్ పాత్రను మమ్ముట్టి అద్భుతంగా పోషించారన్న ప్రశంసలు వస్తున్నాయి.