ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అన్ని రాష్ట్రాలకంటే విభిన్నంగా ఉంటాయి. ముక్యంగా వైసీపీ, టీడీపీల మధ్య రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి తాజాగా.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా…విజయసాయిరెడ్డి మరోసారి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చాడు. “బీసీలంటే బ్యాక్ బోన్ వర్గాలని సిఎం @ysjagan గారు మొదటి నుంచి చెబుతున్నారు. వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించేలా 56 కార్పోరేషన్లకు ఛైర్ పర్సన్లు, సభ్యులను నియమిస్తే పచ్చ పార్టీ గంగవెర్రులెత్తుతోంది. బీసీలను ఎదగకుండా చేసిన ఘనత బాబు గారిది.” అంటూ ట్వీట్ చేశారు. అంతకుముందు ట్వీట్ లో “వైస్సార్ తర్వాత @ysjagan గారి హయాంలో రాయలసీమలో సేద్యంపై మళ్లీ ఆసక్తి , ఆదరణ పెరిగింది. ఇరిగేషన్ సదుపాయాలవల్ల భూములన్నీ పచ్చగా మారాయి. వరుణ దేవుడు కరుణతో బీడు భూములు మళ్ళీ సాగుకు నోచుకుని కోనసీమను తలపిస్తున్నాయి. అందుకే అనేది జగన్ గారిది రైతు ప్రభుత్వం” అని సీఎం జగన్ ను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పొగిడారు.
previous post
next post