ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ పథకాలపై విమర్శలు చేస్తూనే ఉంది టీడీపీ. అయితే…టీడీపీకి ధీటుగా వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. ఇప్పటికే మూడు రాజధానులు విషయంపై ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగుతున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా…విజయసాయిరెడ్డి మరోసారి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చాడు. “స్వభావరీత్యా చంద్రబాబు పేథలాజికల్ లయ్యర్ (Pathological liar). అలవోకగా, కళ్లార్పకుండా అబద్ధాలు చెబుతాడు. ఇలాంటి వారు అసత్యం పలకకుండా తమను తాము నియంత్రించుకోలేరని సోషల్ సైకాలజి విశ్లేషిస్తుంది. దావోస్ వెళ్లినా, ఐఐటి ముంబాయి విద్యార్థులతో అయినా అలాగే కటింగ్ లిస్తాడు!” అంటూ ఫైర్ అయ్యారు. అంతకుముందు ట్వీట్ లో “బాబు చెప్పినట్టు తన ‘చిట్ట చివరి’ ఐదేళ్ల పాలనలో 15 లక్షల కోట్ల పెట్టబడులు తెచ్చి ఉంటే రాష్ట్రంలోని యువతీ, యువకులెవ్వరూ నిరుద్యోగులుగా మిగలకూడదు. నిరుద్యోగ భృతి ఇచ్చే అవసరం కూడా అయనకు వచ్చి ఉండకూడదు. పాపం. ఇలా గొప్పలు చెప్పుకుంటూ రిటైర్మెంట్ రోజుల్ని వెళ్లదీస్తున్నాడు!” అంటూ చంద్రబాబు పై నిప్పులు చెరిగారు.
previous post