telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఆంధ్రా బ్యాంక్ ను విలీనం చేయెద్దు..కేంద్రానికి వైసీపీ ఎంపీ లేఖ

balashowri vallabaneni

ఆంధ్రా బ్యాంకు విలీనం నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరుతూ ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లకు వైసీపీ ఎంపీ బాలశౌరి లేఖ రాశారు. ఆంధ్రాబ్యాంక్ విలీనం తెలుగువారి మనోభవాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ లేఖలో పేర్కొన్నారు. ఒకవేళ విలీనం తప్పనిసరైతే యూనియన్ బ్యాంక్ ను ఆంధ్రా బ్యాంకులో విలీనం చేయాలని కోరారు. అంతేకాదు ఆంధ్రా బ్యాంకు హెడ్ క్వార్టర్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కోరారు.

శుక్రవారం సాయంత్రం ఆంధ్రా బ్యాంకుతోపాటు మెుత్తం 10 బ్యాంకుల విలీనంపై కీలక ప్రకటన చేశారు కేంద్రం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఇకపోతే ఆంధ్రాబ్యాంకు విలీనంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని నిరసిస్తూ తెలుగు రాష్ట్రాల్లో నిరసన వ్యక్తమవుతుంది. ఆంధ్రా బ్యాంకు ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు.

Related posts