telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

క్రమశిక్షణ ఉల్లంగిస్తే సహించేది లేదు: విజయసాయిరెడ్డి

Vijayasai reddy ycp

వైసీపీలో క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడితే ఎంతటివారైనా సహించేది లేదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఈ రోజు తాడెపల్లి గూడెంలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏమైనా సమస్యలుంటే వాటిని పార్టీ అధ్యక్షులు, సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకురావాలని చెప్పారు.

ఇష్టానుసారంగా వ్యవహరించి నేరుగా మీడియా ముందుకు సమస్యలు తీసుకువస్తే సహించేది లేదని చెప్పారు. పార్టీలో క్రమశిక్షణకు పెద్ద పీఠ వేస్తున్నామనిపేర్కొన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాన్నారు. జనాభా ప్రాతిపాదికన బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని రాజ్యసభలో ప్రవైట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టామని ఆయన తెలిపారు.

Related posts