పసుపు-కుంకుమకు ఉన్న పవిత్రతను సీఎం చంద్రబాబు తుడిచేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఓటర్లను కొనేందుకు చంద్రబాబు కొత్త అవతారమెత్తాడనే విషయం పసుపు-కుంకుమ ద్వారా తెలుస్తోందని అన్నారు. తిరుమలలో ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల పసుపు-కుంకుమను తుడిచేలా బెల్డ్షాపులు రావటానికి చంద్రబాబే కారణమని రోజా ఆరోపించారు.
మీ ఇంట్లో ఆడవాళ్ల తాళిబొట్టుపై ప్రమాణం చేసి ఈ పసుపు-కుంకుమ డ్రామా కాదని చెప్పగలరా అని రోజా ప్రశ్నించారు. చంద్రబాబును ‘అన్న’ అని కాకుండా ‘దున్న’ అని పిలవాలన్నారు. పింఛన్ రూ.2 వేలకు పెంచి తనకు ఓట్లు వేయాలని అడుగుతూ ఎంత దిగజారిపోతున్నారో అర్థమవుతోందని రోజా వ్యాఖ్యానించారు.
అత్తింటివారిపై లాలూ కోడలు సంచలన వ్యాఖ్యలు