telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రైతు భరోసాపై అట్టుడికిన అసెంబ్లీ.. చంద్రబాబు పై రోజా విమర్శలు

Roja Mla

ఏపీ అసెంబ్లీలో రైతు భరోసా పథకంపై వాడివేడీగా చర్చ సాగింది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగింది. వైసీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు, తనయుడు లోకేశ్ పై తీవ్ర విమర్శలు చేశారు. వర్ధంతికి, జయంతికి తేడా తెలియని స్థితిలో చంద్రబాబు తనయుడున్నాడని పేర్కొన్నారు. ఏపీ దేశమో, రాష్ట్రమో తెలియని స్థితిలో ఉన్నాడంటూ దుయ్యబట్టారు.

టీడీపీ పాలనలో రైతులు 90 శాతం అప్పులపాలైంది నిజంకాదా? అని ప్రశ్నించారు. రైతులు తమ ఉత్పత్తులకు మద్దతు ధర రాక వారు నలిగిపోయిన పరిస్థితులు తెలియదా? అంటూ చంద్రబాబును నిలదీశారు. సీఎం జగన్ రైతు శ్రేయస్సే లక్ష్యంగా ముందుకు పోతున్నారని చెప్పారు. రైతు భరోసాను ప్రారంభించిన జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాల్సిందిపోయి.. ప్రతిపక్ష నాయకుడు విమర్శలకు దిగడం సబబు కాదని ఆమె అన్నారు.

Related posts