టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంపై మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రమంగా నిర్మించిన నివాసంలో చంద్రబాబు ఉంటున్నారంటూ రామకృష్ణారెడ్డి ఆరోపించారు. కృష్ణా నది కరకట్ట మీద అక్రమంగా నిర్మించిన కట్టడాలపై కోర్టులో పోరాటం కొనసాగుతుందని ఆయన చెప్పారు. ఆ నివాసం నుంచి చంద్రబాబును ఖాళీ చేయిస్తామని వ్యాఖ్యానించారు.
రాజధాని గురించి మాట్లాడే చంద్రబాబు… అమరావతిలో ఇల్లు కూడా కట్టుకోలేదని విమర్శించారు. తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్ ఇల్లు కట్టుకున్నారని అన్నారు. రాజధాని పనులు ఎందుకు ఆగిపోయాయో తనకు తెలియదని, పనులను ఎందుకు నిలిపివేశారో కాంట్రాక్టర్లు చెప్పాలని అన్నారు. కాంట్రాక్టర్లకు ఏవైనా అనుమానాలు ఉంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించారు.
చంద్రబాబు కష్టపడినప్పటికీ.. టీడీపీ ఎమ్మెల్యేలు గజదొంగలు: సీపీఐ నారాయణ