telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఊరినే ఉద్దరించలేని వ్యక్తి రాష్ట్రాన్ని ఉద్దరిస్తారు…

విశాఖలో రెండు లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందకుండా అడ్డుపడింది చంద్రబాబు, విశాఖకు వ్యతిరేకంగా పనిచేసే చంద్రబాబు ఏ ముఖంతో విశాఖలో తిరుగుతున్నారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. మేం మీలా ఒకే కులం వారి కోసం కోసం పని చేయడం లేదు .అర్హులు ఎవరైనా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లబ్ధి చేకూర్చిందని అన్నారు. పీకడానికి మీ దగ్గర ఏముంది. గత ఎన్నికల్లో మంగళగిరిలో లోకేష్ కు జనం పీకింది చాలదా ? అని ప్రశ్నించారు. అయిదేళ్ళు అధికారం లో వుండి కూడా విశాఖ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించలేదు అని అయన ప్రశ్నించారు. పూర్తిగా అభ్యర్థులను కూడా నిలబెట్టలేని పార్టీ విశాఖలో ఎలా గెలుస్తుంది ? అని ఆయన అన్నారు. మీ పార్టీ మీ శక్తి ఏంటో కుప్పం ఎన్నికల్లో జనం చూపించారని, మొన్న జరిగిన ఏకగ్రీవాల్లో 590 వైఎస్ఆర్ సీపీ దక్కించుకుందని అన్నారు. వూరు ఉద్దరించలేని వ్యక్తి రాష్ట్రాన్ని ఉద్దరిస్తారు అంటే జనం ఎలా నమ్ముతారు ? అని ప్రశ్నించారు. కుప్పంలోనే ప్రజలు ఓటు వేయలేని నాయకునికి విశాఖలో ఎందుకు ఓటు వేస్తారు ? అని ప్రశ్నించారు. విశాఖ రాజధానిగా వ్యతిరేకించి భూకంపాలు వస్తాయని దుష్ప్రచారం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడని ఆయన అన్నారు. విశాఖపట్నం నీ చంద్రబాబు నాయుడు వాడుకున్నారు తప్ప ఏ ఒక్కరికి ఉపయోగపడలేదని వైఎస్ఆర్ హయాంలో  విశాఖ సెంట్రల్ పార్క్.. హెల్త్ సిటీ…ఐటీ పార్కులు వచ్చాయని అన్నారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఏమిటి ? అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడికి ధైర్యముంటే బీజేపీపై విమర్శలు చేయొచ్చు కదా ? అని ప్రశ్నించారు. మోడీ పేరు ఉచ్చరించడానికి చంద్రబాబునాయుడు భయపడుతున్నారని అన్నారు.

Related posts