ఆదపడచుల కోసం ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పసుపు-కుంకుమ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి స్పృహ తప్పిపడిపోయారు. తిరుపతిలోని వేదాంతపురంలో డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చెవిరెడ్డి భాస్కరరెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా చెవిరెడ్డి ప్రసంగిస్తుండగా మహిళా సంఘాలు అడ్డుకున్నాయి. చెవిరెడ్డి వెనక్కి వెళ్లాలంటూ మహిళలు నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో వేదిక వద్దే చెవిరెడ్డి స్పృహ కోల్పోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చికిత్స నిమిత్తం వెంటనే ఆయనను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి పోలీసులు తరలించారు.