కలకత్తాలో సీబీఐ దాడిని నిరసిస్తూ మమతా బెనర్జీ చేసిన దీక్షపై వైసీపీ స్పందించింది. తాజాగా ఒక జాతీయ ఛానెళ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, కలకత్తా విషయంలో తమ మద్దతు మోడీకే నని స్పష్టం చేశారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిఉంది కూడా మమతా రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించారని, అందుకే ఆమెకు వైసీపీ మద్దతు పలకలేదని ఆయన చెప్పారు.
శారదా కుంభకోణంలో సాక్ష్యాలు తారుమారు చేశారన్న సీబీఐ ఆరోపణలు తప్పైతే మమతా వాటిని రాజ్యాంగ బద్దంగా ఎదుర్కోవాలి, కానీ ఇలా విచారణకు అడ్డుతగలకూడదని వైసీపీ నేత అన్నారు. ధర్మవిరుద్దంగా మమతా ప్రవర్తించారని ఆమెకు మద్దతు పలకలేదని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.
ఇప్పటికే వైసీపీ మోడీ తోక పార్టీ అంటున్న ఇతర పార్టీలకు ఈ మద్దతు విషయం బలాన్ని చేకూర్చింది. దీనితో ఈ సంఘటనను సాకుగా చూపించి, వైసీపీ నిజంగానే మోడీ తోక పార్టీ అని పెద్దఎత్తున విమర్శిస్తున్నాయి.