telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

యాసిడ్ పోసి..గొంతు కోసి చంపుతానంటూ మహిళకు వైసీపీ నేత బెదిరింపులు

ycp ap

అనంతపురంలో వైసీపీ నేత మన్సూర్ కీచకపర్వం బయటపడింది. యాసిడ్ పోసి.. గొంతు కోసి చంపుతానంటూ ఓ మహిళకు ఆ వైసీపీ నేత బెదిరింపులకు దిగాడు. భర్తను పొగొట్టుకున్నావ్.. ఇంకా ఎవరినైనా పోగొట్టుకోవాలనుకుంటున్నావా అంటూ బాధితురాలు సల్మాను హెచ్చరిస్తున్నాడు. నా భర్త చావుకు కారణం వైసీపీ నేత మన్సూర్ కారణమని…ఈ వ్యవహారం బయటపెడుతాననే ఇలా బెదిరిస్తున్నారని బాధితురాలు సల్మా ఆవేదన వ్యక్తం చేస్తోంది. పోలీసుల సమక్షంలో పర్సనల్ ఫోటోలు సామాజిక మాద్యమాల్లో పెడతానంటూ బెదిరింపులు వస్తున్నాయని..మన్సూర్ , అతని అనుచరుల ద్వారా కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పు ఉందని ఆమె పేర్కొంది. మేం పులివెందుల వాళ్లం.. మమ్మల్ని ఎవ్వరూ ఏమి చేయలేరని..నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అంటూ దౌర్జన్యం చేస్తున్నారని తెలిపింది బాధితురాలు సల్మా. ఇక్కడి పోలీసులతో న్యాయం జరగదని… నా భర్త అనుమానాస్పద మృతి వెనుక వైసీపీ నేత మన్సూర్ హస్తం ఉందని తెలిపింది. పంచాయతీకోసం వైసీపీ నేత వద్దకు వెళ్లిన తనను వైసీపీ నేత మన్సూర్ లొంగదీసుకున్నాడని..నీ పిల్లలను చూసుకుంటాను అని మాయమాటలు చెప్పి ఇప్పుడు నన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడని చెప్పింది. ఇప్పుడు విషం తాగి చనిపోమ్మని చెబుతున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

Related posts