telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాజన్న రాజ్యం కోసం ఐదేళ్లు కష్టపడ్డాం: లక్ష్మీపార్వతి

lakshmi-parvathi

ఆంధ్రప్రదేశ్ లో రాజన్న రాజ్యం కోసం ఐదేళ్లు కష్టపడ్డామని వైసీపీ నేత నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. ఓ టీవీ ఛానల్ లో జరిగిన చర్చావేదికలో ఆమె మాట్లాడుతూ టీడీపీ ఐదేళ్ల పాలనలో ఏ ఒక్క వర్గానికీ న్యాయం జరగలేదని విమర్శించారు. ముఖ్యంగా రైతులు అల్లాడిపోయారని అన్నారు. రాష్ట్రంలో టీడీపీ ఓటమితో తాను చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు.

చంద్రబాబు తన ఐదేళ్ల పదవీకాలంలో అబద్ధాలతో కాలక్షేపం చేశారని దుయ్యబట్టారు. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఆశావర్కర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు సహా సామాన్యులకు లబ్ధి కలిగేలా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. రాజన్న రాజ్యం తెస్తామన్న జగన్ తన మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నారని అన్నారు.

Related posts