telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ప్రచారంలో ఘర్షణలు : జిల్లాలో వైసీపీ-టీడీపీ శ్రేణుల ప్రచారం .. ఆరుగురు అరెస్ట్ ..

YCP released MLA Candidates List

ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ఏపీలో ప్రకాశం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జిల్లాలోని కందుకూరులో నిన్న వైసీపీ-టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న నేపథ్యంలో టీడీపీ నేతల ఫిర్యాదుతో ఆరుగురు వైసీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వీరికి స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి పోలీసులు నిరాకరించారు. దీంతో వైసీపీ నేత, మాజీమంత్రి మహీధర్ రెడ్డి వైసీపీ శ్రేణులతో కలిసి కందుకూరు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ఆరుగురు వైసీపీ కార్యకర్తలను పోలీసులు జడ్జీ ముందు హాజరుపరిచారు.

కందుకూరులో నిన్న సర్వే నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను వైసీపీ కార్యకర్తలు పట్టుకున్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగుల వివరాలను వీరు నమోదుచేస్తున్నారంటూ ఆర్డీవో కార్యాలయానికి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేత పోతుల రామారావు అనుచరులు, టీడీపీ కార్యకర్తలు అక్కడకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య చెలరేగిన వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతల ఫిర్యాదుతో పోలీసులు వైసీపీ కార్యకర్తలపై కేసు పెట్టారు.

Related posts