telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

ఎబీఎన్ ఎండీ రాధాకృష్ణపై వైసీపీ ఎంపీ ఫిర్యాదు!

YCP padma comments Chandrababu
ఎబీఎన్ ఎండీ వి. రాధాకృష్ణపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జూబ్లీహిల్స్ పోలిసులకు  ఫిర్యాదు చేశారు. ఏబీఎన్ ఛానెల్‌లో తన ఆడియో టేపు అంటూ నకిలీ ఆడియో టేపును ప్రసారం చేశారని ఆయన ఆరోపించారు. అస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తితో తన వాయిస్ అంటూ ఓ కథనాన్ని ప్రసారం చేశారని ఆయన ఆరోపించారు.ఈ కథనంలో తాను వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా ప్రసారం చేశారని ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. 
తెలంగాణ ప్రజల మాదిరిగా ఆత్మగౌరవం, కమిట్‌మెంట్ ఏపీ ప్రజలకు లేదని ఆ ఆడియో సంభాషణలో విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించినట్టుగా ఉంది. ఏబీఎన్ ప్రసారం చేసిన కథనంపై విజయసాయి రెడ్డి ఫిర్యాదు చేసినట్టుగా జూబ్లీహిల్స్ జూబ్లీహిల్స్ ఇన్స్‌పెక్టర్ కె. బాలకృష్ణరెడ్డి చెప్పారు కె. బాలకృష్ణరెడ్డి చెప్పారు. ఈ కథనం ప్రసారం చేయడం వెనుక ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కుట్ర ఉందని  వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి  ఆరోపించారు.  ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద ప్రజాప్రాతినిథ్య చట్టం 125 కింద కేసు నమోదు చేయాలని  విజయసాయిరెడ్డి కోరారు.

Related posts