telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

‘ఆంధ్రజ్యోతి’ రాధాకృష్ణపై  వైసీపీ నేతల ఫిర్యాదు!

YCP released MLA Candidates List
ఆంధ్రజ్యోతి సంస్థ ఎండీ వేమూరి రాధాకృష్ణపై  వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఆంధ్రజ్యోతి పత్రికలో ఇటీవల ప్రచురితమైన ఓ సర్వేపై వైసీపీ నేతలు నాగిరెడ్డి, గౌతంరెడ్డి పోలీసులను ఆశ్రయించారు. విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావును కలిసి ఫిర్యాదు చేశారు. ఆంధ్రజ్యోతి దిన పత్రికలో ఉద్దేశపూర్వకంగా బోగస్ సర్వే ప్రచురించిన ఆ సంస్థ ఎండీపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ బోగస్ సర్వేను ప్రచురించినందుకు రాధాకృష్ణపై చీటింగ్, ఫోర్జరీ కేసులు పెట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Related posts