ఆంధ్రజ్యోతి సంస్థ ఎండీ వేమూరి రాధాకృష్ణపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఆంధ్రజ్యోతి పత్రికలో ఇటీవల ప్రచురితమైన ఓ సర్వేపై వైసీపీ నేతలు నాగిరెడ్డి, గౌతంరెడ్డి పోలీసులను ఆశ్రయించారు. విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావును కలిసి ఫిర్యాదు చేశారు. ఆంధ్రజ్యోతి దిన పత్రికలో ఉద్దేశపూర్వకంగా బోగస్ సర్వే ప్రచురించిన ఆ సంస్థ ఎండీపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ బోగస్ సర్వేను ప్రచురించినందుకు రాధాకృష్ణపై చీటింగ్, ఫోర్జరీ కేసులు పెట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
previous post
next post
ప్రజా సమస్యలపై పోరాడుతా : పవన్