telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రకాశం జిల్లాలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణుల దాడి

ycp party

సార్వత్రిక ఎన్నికల అనంతరం ఏపీలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని కొండేపల్లిలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణుల దాడికి పాల్పడ్డారు. స్వగ్రామంలో ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి కార్యకర్తలకు విందు ఏర్పాటు చేశారు. ఆ విందుకు వెళ్లిన తల్లి, కుమారుడిపై వైసీపీ కార్యకర్తల దాడికి తెగబడ్డారు. దాడిలో తల్లి సువార్తమ్మ, కుమారుడు సురేష్‌కు గాయాలయ్యాయి. వెంటనే వారిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన పై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Related posts