telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు .. ఇంటి గోడను కూల్చి, పురుగుల మందు తాగించి..!

ycp party

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలోని తంగేడలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. తంగేడలో టీడీపీకి చెందిన బత్తుల సుబ్బమ్మ, నరసింహారావు మధ్య స్థల వివాదం నడుస్తోంది. గతంలో ఈ ఇద్దరి మధ్య సమస్యను గ్రామ పెద్దలు పరిష్కరించారు. గతంలో ఆ స్థలం సుబ్బమ్మకే చెందుతుందని గ్రామ పెద్దలు తేల్చి చెప్పారు.

అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ వివాదం మరొసారి తెరపైకి వచ్చింది. నరసింహారావు అనుచరులు సుబ్బమ్మపై దాడి చేసి.. ఆ ఇంటి ప్రహరీ గోడను కూల్చివేశారు. తర్వాత ఆమెతో పురుగుల మందు తాగించారు. ప్రస్తుతం బాధితురాలు గురజాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

Related posts