telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబు పాలిచ్చే ఆవు కాదు.. రక్తాన్ని పీల్చే జలగ: అంబటి

YCP Ambati Slams to JD Laxminaryana

పాలిచ్చే ఆవును వదిలి తన్నే దున్నపోతును తెచ్చుకున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. చంద్రబాబు పాలిచ్చే ఆవు కాదు, రక్తాన్ని పీల్చే జలగ అని ఘాటుగా విమర్శించారు. చంద్రబాబు అబద్ధాలు ప్రచారాలు చేస్తే ప్రజలు నమ్మరని, ఇంతవరకూ చేసిన అబద్ధపు ప్రచారాల వల్లే మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలైందని ఎద్దేవా చేశారు.

బందరు పోర్టు తెలంగాణకు ఇచ్చేస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశా వర్కర్లకు సంబంధించి చంద్రబాబు చేసిన ట్వీట్ ను అంబటి తప్పుబట్టారు. 2017లో తెలంగాణలో జరిగిన ఆందోళనకు సంబంధించిన ఆశా వర్కర్ల ఫొటోను చంద్రబాబు పోస్ట్ చేశారని విమర్శించారు. సీఎం జగన్ ప్రభుత్వంపై అనవసరంగా బురదచల్లొద్దని చంద్రబాబుకు హితవు పలికారు.పైవిధంగా వ్యాఖ్యలు చేశారు.

Related posts