telugu navyamedia
రాజకీయ వార్తలు

మోదీతో రాజీనామా చేయించాలని వాజ్‌పేయి భావించారు: యశ్వంత్ సిన్హా

modi on telugu states separation

దేశాన్ని కుదిపేసిన గోద్రా అల్లర్ల కేసులో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీతో రాజీనామా చేయించాలని అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌ పేయి భావించారని కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా అన్నారు. మోదీ కనుక రాజీనామాను తిరస్కరిస్తే ఏకంగా ప్రభుత్వాన్ని రద్దు చేయాలని మోదీ నిర్ణయించారని అన్నారు.

ఆ సమయంలో మోదీకి అప్పటి కేంద్ర హోంమంత్రి అద్వానీ అండ గా నిలిచారన్నారు. మోదీని పదవి నుంచి తప్పిస్తే తాను కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేస్తానని అద్వానీ బెదిరించారని, దీంతో వాజ్‌పేయి వెనక్కి తగ్గారని సిన్హా వివరించారు. ఆ రోజు కనుక వాజ్‌పేయి వెనక్కి తగ్గకుంటే మోదీ కథ అప్పుడే ముగిసి ఉండేదని యశ్వంత్ సిన్హా పేర్కొన్నారు.

Related posts