telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

శాంతిభద్రతలు దిగజారితే ఏపీకీ చెడ్డపేరు: యనమల

Minister Yanamala comments Ys Jagan

ఏపీలో వైసీపీ ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం జరుగుతున్నా దాడుల పై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలపై దాడులను యనమల ఖండించారు. నెల రోజుల్లోనే 130పైగా దాడులు, దౌర్జన్యాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఆస్తులు ధ్వంసం చేస్తున్నా సీఎం స్పందించక పోవడం గర్హనీయమన్నారు.

శాంతిభద్రతలు దిగజారితే మొత్తం ఆంధ్రప్రదేశ్‌కే చెడ్డపేరు వస్తుందని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రారని తెలిపారు. వచ్చిన పెట్టుబడులు కూడా వెనక్కి పోతాయని యనమల పేర్కొన్నారు. దౌర్జన్యాలకు పాల్పడుతున్న వైసీపీ శ్రేణులను అడ్డుకోవాలన్నారు.

Related posts