telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

నన్ను వేధిస్తున్నారు.. యామిని సాధినేని టీడీపీ..పిర్యాదు !

TDP Yamini fire to Ys Jagan

తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామినికి సోషల్ మీడియాలో వేధింపులు ఎదురయ్యాయి. కొంతమంది ఆకతాయిలు యామిని ఫోన్ నంబర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనితో రోజూ 20 నుంచి 30 మంది ఆకతాయిలు ఫోన్ చేస్తూ వేధింపులకు గురిచేయడం ప్రారంభించారు. అర్ధరాత్రులు ఫోన్ చేయడంతో పాటు, అసభ్యకరమైన సందేశాలు పంపుతూ తీవ్ర మనోవేదనకు గురిచేశారు.

అంతటితో ఆగకుండా .. మార్ఫింగ్ ఫొటోలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి దూషణలకు దిగారు. ఈ నేపథ్యంలో యామిని పీఆర్వో పొట్లూరి వెంకట సుధీర్ గుంటూరులోని పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ ఐటీ విభాగం ప్రధాన కార్యదర్శి డి.శ్యామ్‌ కలకాల, మానుకొండ రామిరెడ్డి, వైఎస్సార్‌ అశోక్‌, కామిరెడ్డి రాము, మధుసూదనరెడ్డి, లక్ష్మీసుజాత తదితరులు ఈ వేధింపుల వెనుక ఉన్నారని ఆరోపించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Related posts