telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రణబ్ మృతి పట్ల మాజీ ఎంపీ విచారం

yalamanchali shivaji

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి దేశానికి తీరని లోటని అన్నారు. తనపై ప్రణబ్ ముఖర్జీ ఎంతో వాత్సల్యాన్ని చూపించేవారని గుర్తు చేసుకున్నారు. ప్రణాళికా సలహా మండలిలో తాను సభ్యుడిగా ఉన్నప్పుడు పలు అంశాలపై తమ నివేదికలు చూసి ప్రణబ్ ఎంతో మెచ్చుకునేవారని చెప్పారు.

తాను రాజ్యసభ సభ్యుడిగా పదవీ విరమణ చేసినప్పుడు తన కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారని తెలిపారు. ఢిల్లీలోనే ఉండాలని, గుంటూరు వెళ్లొద్దని సూచించారని చెప్పారు. వ్యవసాయంపై నియమించే హైపవర్ కమిటీలో ఉండమని తనకు అవకాశం ఇచ్చారని చెప్పారు. అయితే తాను అప్పుడు అమెరికా వెళ్లానని తెలిపారు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత కూడా ఆయన తనతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవారని శివాజీ అన్నారు.

Related posts