వైసీపీ నేత యడం బాలాజీ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తాజాగా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. బాబు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీకూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ముందుగా అనుకున్నట్టుగానే వంగవీటి కూడా టీడీపీలో చేరారు. వీరిద్దరూ కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకోవడం విశేషం. వీరి చేరిక అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, కేసీఆర్ పై తీవ్రంగా విమర్శలు గుప్పించారు.
మిగులు బడ్జెట్ ఉండికూడా ఎటువంటి అభివృద్ధి చేసింది లేదు, పైగా అందరిని బెదిరించి గెలిచారు అన్నారు. ఏపీ ప్రతిపక్షనేత ఆస్తులు కూడా తెలంగాణలోనే ఉండటంతో ఆయన కూడా కేసీఆర్ చేతిలో బందీనే అని, అందుకే ఇక్కడ రాజకీయాలను అక్కడనుండి కంట్రోల్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ దుష్ట రాజకీయాల నుండి ఏపీని ఒక్క టీడీపీ మాత్రమే రక్షించగలదని ఆయన అన్నారు. గంటా టీడీపీ వీడుతున్నట్టు .. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. బాలాజీని మొదటి నుండి వైసీపీ అధినేత జగన్ మోసం చేస్తూనే ఉన్నారని, ఇప్పటికి ఆయన మంచి నిర్ణయం తీసుకున్నారని.. ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని బాబు చెప్పారు. అలాగే వంగవీటి కి కూడా తగిన స్థానం కల్పించే బాధ్యత తనదేనని అన్నారు.
రాష్ట్రంలో దుర్మార్గం రాజ్యమేలుతోంది: లోకేశ్