telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

యాదాద్రి స్తంభాలపై కేసీఆర్ బొమ్మలు..తొలగించాలని బీజేపీ ఎమ్మెల్యే డిమాండ్

BJP-MLA Raja-Singh

ఏంతో ప్రాశస్త్యం ఉన్న యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్నితెలంగాణ  ప్రభుత్వం అన్ని హంగులతో అభివృద్ది చేస్తుంది. అయితే ఆలయ ప్రాకారంలోని మండప స్తంభాలపై సీఎం కేసీఆర్ ముఖచిత్రం చెక్కడం వంటి ఫోటోలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఈ వ్యవహారంపై తెలంగాణ బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. యాదాద్రి ఆలయ గోడలు, స్తంభాలపై కేసీఆర్ బొమ్మ, కారు బొమ్మ, ఆయన తీసుకొచ్చిన పథకాలను చెక్కుతున్నారని రాజాసింగ్ విమర్శించారు.ఇలాంటి చర్యల ద్వారా కేసీఆర్ తనను తాను భగవంతుడిగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారని విమర్శించారు.

యాదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేయడం అన్నది ప్రభుత్వ బాధ్యత అనీ, ఇందుకోసం టీఆర్ఎస్ నేతలు, పార్టీ జేబుల నుంచి డబ్బులు పెట్టడం లేదని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ప్రజల సొమ్ముతో గుడి కడుతున్న నేపథ్యంలో ఇలాంటి చర్యలు సరికావని హితవు పలికారు. ఈ విషయంలో కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవేళ వీటిని తొలగించకుంటే తెలంగాణ ప్రజలతో కలిసి తామే తొలగిస్తామని రాజాసింగ్ హెచ్చరించారు.

Related posts