తెలంగాణ మంత్రి జగదీశ్వర్రెడ్డి బుధవారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహా స్వామి ఆలయంలో మొక్కులు సమర్పించారు. ఈ క్రమంలో ప్రజాప్రతినిధులు పీటలపై కూర్చోగా…కలెక్టర్ కింద కూర్చోవడంపై ఆమెకు అవమానం జరిగినట్టు సోషల్ మీడియా లో ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. మంత్రితో పాటు ఆయన వెంట ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు గొంగిడి సునిత, పైళ్ల శేఖర్రెడ్డి, గాదరి కిషోర్, ఎమ్మెల్సీ ఎలిమినేటి క్రిష్ణారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు గొంగిడి మహేందర్రెడ్డి, మోతె పిచ్చిరెడ్డిలు దర్శనానికి వచ్చారు.
అయితే ఆశీర్వచనం చేసే ప్రక్రియ సందర్భంగా ప్రజాప్రతినిధులు పీటలపై కూర్చున్నారు. ఆ సమయంలో కలెక్టర్ అనితారామచంద్రన్ మాత్రం కింద కూర్చోవడం హాట్ టాపిక్ గా మారింది. అయితే దేవుడి విగ్రహం ముందు పీటల మీద కూర్చొవద్దనే తనూ కింద కూర్చున్నాననీ, ఇందులో ఎవరి తప్పిదమూ లేదనీ కలెక్టర్ తెలిపారు. ఆలయానికి విచ్చేసిన ప్రతీసారి ఇలాగే ఆమె కూర్చుంటారని ఆలయ అధికారులు వివరణ ఇవ్వడం విశేషం.
అమరావతి రైతులు రోడ్డెక్కడానికి చంద్రబాబే కారణం: మంత్రి కన్నబాబు