షామీ సంస్థ మూడు కొత్త ఉత్పత్తులను తాజాగా భారత్ లో విడుదల చేసింది. వీటిలో రెండు స్మార్ట్ఫోన్లు, మరొకటి స్మార్ట్ ఎల్ఈడీ బల్బు. షామీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కుమార్ జైన్, చీఫ్ మార్కెటింగ్ అధికారి అనూజ్ శర్మ వీటిని బుధవారం విడుదల చేశారు. తమ గత మోడల్ రెడ్మీ వై2ను మరింత అప్గ్రేడ్ చేసి రెడ్మీ వై3 పేరుతో ఫోన్ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. ఇది వై2 కన్నా మరింత శక్తిమంతమైందని చెప్పారు. రెడ్మీ 6కు అప్గ్రేడ్ వెర్షన్గా రెడ్మీ 7ను ఆవిష్కరించారు. ఈ ఫోన్ ఏప్రిల్ 29 నుంచి ఎంఐ.కామ్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఎంఐ స్టోర్లలో అమ్మకానికి సిద్ధంగా ఉంటుందని, రెడ్మీ వై3 మాత్రం ఏప్రిల్ 30 నుంచి అందుబాటులో ఉంటుందని వివరించారు.
స్మార్ట్ ఎల్ఈడీ బల్బు గూగుల్ అసిస్టెంట్, అలెక్సాను సపోర్ట్ చేసేలా తీర్చిదిద్దారు. ఈ బల్బును మొబైల్ యాప్ నుంచి కూడా నియంత్రించే వీలుంది. షామీకు ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లోని 300 నగరాల్లో వెయ్యి ఎంఐ స్టోర్లు ఉన్నాయని వివరించారు. మొత్తం 10 వేల ఆఫ్లైన్ రీటైల్ స్టోర్లు నెలకొల్పడం తమ లక్ష్యమని వెల్లడించారు.
ఫీచర్లు :
రెడ్మీ వై3
* ముందువైపు 32 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా
* వెనుక 12+2 ఎంపీ డ్యుయల్ కెమెరా
* 15.9 సెంటీమీటర్ల డాట్ నాట్చ్ డిస్ప్లే (కార్నింగ్ గోరిల్లా గ్లాస్ 5)
* క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 632 (ఆక్టాకోర్ ప్రాసెసర్ అప్టూ 1.8 గిగాహెడ్జ్)
* 4000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం
* 3 జీబీ+32 జీబీ, 4 జీబీ+64 జీబీ వేరియంట్లు
ధర: 9,999 నుంచి ప్రారంభం
రెడ్మీ 7
* 8 ఎంపీ సెల్ఫీ కెమెరా
* వెనుక 12+2 ఎంపీ డ్యూయల్ కెమెరా
* 15.9 సెంటీమీటర్ల డాట్ నాట్చ్ డిస్ప్లే
* క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 632 (ఆక్టాకోర్ ప్రాసెసర్ తరహాలో పనిచేసే సామర్థ్యం)
* 4000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం
* 2 జీబీ+32 జీబీ, 3 జీబీ+32 జీబీ వేరియంట్లు
ధర: 7,999 నుంచి ప్రారంభం
రెడ్మీ ఎల్ఈడీ స్మార్ట్ బల్బు
* 10 వాట్స్, 800 లుమెన్స్
* 16 మిలియన్ల కలర్లు ఉత్పత్తి చేసే సామర్థ్యం
* మొబైల్ యాప్ ద్వారా నియంత్రించే సౌకర్యం
* మూడ్కు తగ్గట్లుగా రంగులు మార్చుకొనే వెసులుబాటు