telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

వుహాన్ లో కరోనా పేషెంట్లెవరూ లేరు: అధికారులు వెల్లడి

vuhan-china corona

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ చైనాలోని వుహాన్ నగరంలో పురుడుపోసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ నగరం క్రమంగా పూర్వవైభవాన్ని సంతరించుకుంటోంది. ఇటీవలే అక్కడ లాక్ డౌన్ ను కూడా సడలించారు. ఈ నేపథ్యంలో చివరి కరోనా పేషెంట్ ను ఇక్కడి మెడికల్ సెంటర్ నుంచి డిశ్చార్జి చేశారు. హుబెయ్ ప్రావిన్స్ కు చెందిన వ్యక్తి విషమపరిస్థితిలో ఆసుపత్రిలో చేరగా, ప్రస్తుతం పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జి చేసినట్టు వుహాన్ వైద్య వర్గాలు తెలిపాయి.

దీంతో వుహాన్ లో కరోనా కేసుల సంఖ్య సున్నాకు చేరుకొంది. దీనిపై చైనా జాతీయ హెల్త్ కమిషన్ అధికార ప్రతినిధి మి ఫెంగ్ మాట్లాడుతూ ఏప్రిల్ 26 నాటికి వుహాన్ లో కరోనా పేషెంట్లెవరూ లేరన్నారు. వుహాన్ వైద్య సిబ్బందికి, దేశవ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణులకు ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు. చివరి పేషెంట్ ఎంతో విపత్కర పరిస్థితులను అధిగమించి కోలుకున్నారని వివరించారు. కరోనా పుట్టుకకు కేంద్రస్థానంగా నిలిచిన వుహాన్ నగరంలో 50,333 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3,869 మంది మృతి చెందారు.

Related posts