ఎక్కడ అక్రమం ఉంటే అక్కడ కమ్యూనిజం ఉంటుందని ప్రజావాగ్గేయకారుడు గోరటి వెంకన్న అన్నారు. శుక్రవారం హుజూర్నగర్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ…సీట్లు, ఓట్లు రానంత మాత్రాన కమ్యూనిజం అంతమైపోదని, ప్రజల పక్షాన ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. తెలంగాణ ప్రాంతం ఎన్నో సంపదలకు నిలయమని గోరటి అన్నారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యానికి పుట్టినిల్లు లాంటిదన్నారు. తెలంగాణ ప్రజలు ఎన్నో ఉద్యమాలను చూశారని అన్నారు. ప్రాంతీయ ఉద్యమాల్లోను మానవీయ కోణాన్ని ప్రదర్శించారని అన్నారు. కవులు, కళాకారులు, రచయితలకు ఎంతో ఆదరణ ఉందన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని చవిచూసిన తెలంగాణ ప్రాంతం ఆదర్శంగా ఉద్యమాలు చేసిందన్నారు. కుల, మత ఘర్షణలకు అతీతంగా సమాజమంతా ఒక్కటేనన్న భావంతో జీవిస్తూ ఇతరులకు ఆదర్శంగా జీవిస్తున్నామన్నారు. కమ్యూనిజం ఎప్పుడూ కనుమరుగు కాదని గోరటి వ్యాఖ్యానించారు.
ఏపీకి కేంద్రం నుంచి సహకారం: కన్నా