క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించిన ఐసీసీ వరల్డ్ కప్ ఆఖరి పోరు రేపు జరుగుతుంది. ఇందులో ఎవరు గెలిస్తే వారికే … ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఈ ప్రపంచకప్ సమరంలో టైటిల్ కోసం ఆతిథ్య ఇంగ్లాండ్, గతేడాది రన్నరప్ న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఆదివారం ఈ రెండు జట్ల పోరాటానికి విశ్వవిఖ్యాత లార్డ్స్ మైదానం వేదికగా నిలుస్తోంది.
ఆఖరి పోరుకు ఇరుజట్ల కెప్టెన్లు వరల్డ్ కప్ ట్రోఫీతో ఫొటో సెషన్ లో పాల్గొన్నారు. ఇంగ్లాండ్ సారథి ఇయాన్ మోర్గాన్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ వరల్డ్ కప్ ట్రోఫీకి ఇరువైపులా నిలబడి మీడియా ప్రతినిధుల కెమెరాలకు పోజులిచ్చారు. లార్డ్స్ లోని ప్రెస్ బాక్స్ కు అభిముఖంగా ఉన్న హాల్ లో ఈ కార్యక్రమం నిర్వహించారు.