telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

మొదటి పరీక్షలో పాజిటివ్..రెండో పరీక్షలో నెగటివ్!

Corona

రంగారెడ్డి జిల్లాలో 65 ఏళ్ల మహిళకు కరోన పరీక్షలు నిర్వహించారు. తనలో లక్షణాలు లేకున్నా పాజిటివ్ రావడంపై అనుమానంతో రెండోసారి పరీక్షల్లో నెగటివ్ అని రావడం కలకలం రేపింది. ఈ ఘటన మరోమారుమొయినాబాద్ మండలంలో చోటుచేసుకుంది. ఈ నెల 21న సదరు మహిళ ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకుంది. పరీక్షల్లో ఆమెకు కరోనా సంక్రమించినట్టు తేలింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు గ్రామాన్ని కంటెయిన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు.

కరోనాకు సంబంధించి తనలో ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ ఫలితం పాజిటివ్‌గా రావడంతో అనుమానించిన సదరు మహిళ ఈసారి మరో ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకుంది. 22న వచ్చిన ఫలితాల్లో ఆమెకు నెగటివ్ అని వచ్చింది. దీంతో ఆమె ఊపిరి పీల్చుకుంది. ఈ విషయంపై తమకు అధికారికంగా ఎటువంటి సమాచారం లేదని వైద్యాధికారులు తెలిపారు.

Related posts